Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లిలో విషాదం నెలకొంది. అడ్డగుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఓ చెట్టు మీద విద్యుత్ వైర్లు పడటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారి శ్రీలక్ష్మి(5) ఆ చెట్టును పట్టుకుంది. ఆ చిన్నారిని రక్షించేందుకు వెళ్లి బాపనమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. గాయపడిన శ్రీలక్ష్మి కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.