Musi River | హైదరాబాద్ : మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళ డెడ్బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని కవాడిగూడలోని డీఎస్ నగర్కు చెందిన వెంకటేశ్ భార్య గుండే లక్ష్మి(55)గా పోలీసులు గుర్తించారు.
లక్ష్మి ఆచూకీ తెలియడం లేదని గత ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. లక్ష్మి డెడ్బాడీకి ఉస్మానియా మార్చురీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.