సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం నిరంతరం హస్తినాలో ఒక బృందం ఉండే విధంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం సన్నాహాలు చేస్తున్నది. సైబర్నేరగాళ్లు ఎక్కుగా ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ నుంచి ఉండగా బాధితులు తెలంగాణ, హైదరాబాద్కు చెందిన వాళ్లుంటున్నారు. అయితే బాధితులు నేరం జరిగిందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు సైబర్ నేరగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసిన తరువాత, బ్యాంకింగ్ విభాగం నుంచి ఆయా ఖాతాల వివరాలు తీసుకునే వరకు డబ్బంతా దేశం దాటడమే కాదు, ఆయా నేరగాళ్లు అప్పటి వరకు వాడిన సిమ్కార్డులు, ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా క్లోజ్ చేసి ఆధారాలు లేకుండా చూసుకుంటున్నారు.
దీంతో అసలైన నేరగాళ్లను పట్టుకోవడం కష్టంగా మారుతుంది. అప్పుడప్పుడు 10 నుంచి 20 శాతం కమిషన్కు ఆశ పడి బ్యాంకు ఖాతాలిచ్చిన వారే నిందితులవుతున్నారు. అసలు నిందితులను మాత్రం పోలీసులు పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ఢిల్లీ పరిసరాలలో ఒక టీమ్ను అందుబాటులో ఉంచనున్నారు. ఇక్కడ కేసు నమోదు కాగానే టెక్నికల్ డేటాను సేకరించి, ఢిల్లీలో ఉండే టీమ్లకు ఎప్పటికప్పుడు పంపిస్తే వేగంగా నేరగాళ్లను పట్టుకునే అవకాశముంటుందని 2పోలీసులు భావిస్తూ, తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.