కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రెండు వందలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఏంట్రీ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు. దీనిపై స్థానికులు ప్రశ్నించగా అధికారులే తనకు ఇచ్చారని సమాధానం ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు.
ఈ విషయంపై కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ నరసింహను వివరణ కోరగా అదేమీలేదని తప్పుకునే ప్రయత్నం చేశారు. మరో అధికారిని వివరణ కోరగా వార్డు కార్యాలయాల్లో డేటా ఎంట్రీకి పంపిస్తున్నామని పొంతన లేని సమాధానం చెప్పడం గమనార్హం.