Hyderabad | హైదరాబాద్ : బాలానగర్ మెజిస్టిక్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఢీకొని కందుకూరి దుర్గయ్య(58) అనే వ్యక్తి మృతి చెందాడు. కానిస్టేబుల్ బైక్ ఢీకొనడం వల్లే దుర్గయ్య మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడు ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగాక కానిస్టేబుల్ మల్లికార్జున్ అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. వారం రోజుల నుంచి మల్లికార్జున్ సెలవులో ఉన్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.