సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 9వ తేదీన జరిగిన మెగా లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని సీసీసీ, డీడీ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. 2104 ఎఫ్ఐఆర్లు పరిష్కారం కాగా, అందులో 68 విచారణలో ఉన్నాయని, 2036 కేసులు ట్రయల్ పెండింగ్లో ఉన్నాయన్నారు.
అలాగే, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద నమోదు చేసిన 2491 (ఈ-పెట్టీ కేసులు మాత్రమే) కేసులు, 88,034 ఈపెట్టీ కేసులు, 4314 ఎంవీ యాక్ట్లో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులున్నాయని జాయింట్ సీపీ వివరించారు. పోలీస్, జ్యుడీషియరీ శాఖల సమన్వయంతో నేషనల్ లోక్ అదాలత్ విజయవంతమైందని, గతంలో కంటే ఈసారి ఎక్కువగా కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.