మేడ్చల్, జూలై 30(నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శామీర్పేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, దేశంలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని మంత్రి పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ నుంచి మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన చంద్రకాంత్రెడ్డి, నందు, సాయికిరణ్, అక్షయ్, అదికేశవ్ రెడ్డి, బాల్రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రజ్వల్తో పాటు 150 మంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ప్రభాకర్రెడ్డి, నరేశ్, అజయ్, అల్తాఫ్, బి. ఉదయ్రెడ్డి, ఈశ్వర్, రమేశ్, వాణిప్రసాద్, మధు, ప్రవీణ్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో అనేక ఉద్యోగాలను కల్పిస్తున్న దృష్ట్యా యువతి, యువకులు సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మాయమాటలు చెబుతూ ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఎంపీపీలు ఎల్లుబాయి, హారిక, జడ్పీటీసీ అనిత, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, దయానంద్ యాదవ్, వీరారెడ్డి, చంద్రశేఖర్యాదవ్, సుదర్శన్, మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.