హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bed room houses) ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకొని మోసం(Cheated) చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయసింహ అనే వ్యక్తి పలువురు మహిళల వద్ద డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి రూ. 6 లక్షలు వసూలు చేశాడు. బాధితులు ఇండ్ల గురించి ప్రశ్నించగా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయామని గుర్తించిన మహిళలు బోరబండ(Borabanda) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయసింహపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.