హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ. 7 కోట్లను ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్ గుప్తాలపై డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నిధులతో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సామాజిక సేవ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనున్నాయి.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శాసనసభ్యుల నిధుల నుంచి రూ. 5 కోట్లు, ఎమ్మెల్సీలు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ రూ. 7 కోట్లతో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూడా రూ. కోటి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.