Ganja | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మల్కాజ్గిరి ఎస్వోటీ, చౌటుప్పల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ముఠా నుంచి 64 కిలోల ఎండు గంజాయి, 2 కార్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 32.30 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అరెస్టు అయిన ముగ్గురు నిందితులు కేరళకు చెందినవారని పోలీసులు తెలిపారు.