హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. దుబాయ్ ప్రయాణికుడి నుంచి రూ. 37.30 లక్షల విలువైన 699.5 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.