హయత్నగర్, సెప్టెంబర్ 16 : హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దాదాపు 10కి పైగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 483 మంది ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విప్రో, బైజూస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, విజయ డయాగ్నోస్టిక్స్, క్యూ కానెక్విట్, టెలిఫర్మామెన్స్, విటెకిస్, 24/7, ఐకేఎల్ హెల్త్ కేర్ వంటి కంపెనీల్లో ఉద్యోగాల కోసం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంగారెడ్డి జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఇండియా సంయుక్తంగా నిర్వహించారు.
ఈ డ్రైవ్కు టెన్త్ నుండి పీజీ వరకు విద్యార్హత కలిగిన 700కు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 483 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.శ్రీనివాసులు, అధ్యాపకులు ఎ.అమరేందర్రెడ్డి, డాక్టర్ గీతానాయక్, జి.నరేందర్రెడ్డి, డాక్టర్ ఎస్.సుబ్రహ్మణ్యం, డాక్టర్ జాహెదాబేగం, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు, ఇతర అధ్యాపక సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అధికారి ఎ.పరమేశ్వర్రెడ్డి, శ్రీనివాసరావు విజయవంతంగా నిర్వహించారు.