హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగురోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో ఒక కారులోనుంచి మరో కారులో మత్తుమందును మారుస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు.
వారివద్ద 470 కేజీల గంజాయి, నాలుగు కార్లు, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.