హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతురాలిని భూదేవి(45)గా పోలీసులు గుర్తించారు. భూదేవిపై శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లోని డబ్బును అపహరించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే భూదేవి దత్తపుత్రుడు సాయిచరణ్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.