సంబురానికి సర్వం సిద్ధం
హెచ్ఐసీసీలో నేడే టీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవం
పకడ్బందీగా పక్కా ఏర్పాట్లు..
మియాపూర్/ మాదాపూర్, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలో అతి పెద్దదైన శేరి లింగంపల్లి నియోజకవర్గం సర్వం సన్నద్ధమైం ది. గతేడాది నవంబర్ మాసంలో ఇదే నియోజకవర్గం లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగగా, తిరిగి ఆరు నెలల వ్యవధిలో పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలకు మరోమారు వేదిక కాబోతున్నది. బుధవారం గులాబీ పార్టీ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న తరుణంలో, నియోజకవర్గంలోని ఐటీ ప్రాంతం ప్రస్తుతం వేదికైంది. హెచ్ఐసీసీలో జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. కేంద్రం ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పై నిత్యావసర సరుకుల ధరలతో సహా, ఇతర వస్తు సామగ్రి, తిను బండారాలపై ధరల పిడుగులు వేసి వారి జీవన చిత్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన తరుణంలో.., కేం ద్రంపై పోరుకు 11 కీలక తీర్మానాలను ఆవిర్భావ వేదిక ఆమోదించనున్నది.
పేదల గుండె చప్పుడుగా పార్టీ తీర్మానాలు ఉండబోతున్నాయని మంత్రి కేటీఆర్ మం గళవారం సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించి అనంతరం ప్రకటించారు. బాల్య కౌమార దశను దాటుకుని మేజర్గా పరిణమించి టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాల ను పూర్తి చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ వేడుకలకు సంబంధించి హెచ్ఐసీసీలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన పలు కమిటీలు అహరహం శ్రమించి ఆహుతులకు ఎటువంటి ఇబ్బందుల కలగని తీరిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
33 జిల్లాల నుంచి హెచ్ఐసీసీకి..
హెచ్ఐసీసీలో బుధవారం జరగనున్న 21వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 3500 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. సీఎం నుంచి మండల పార్టీ అధ్యక్షుల వరకు వివిధ స్థాయిలో పార్టీ శ్రేణులు ప్రత్యేక ఆహ్వానితులుగా సభకు తరలిరానున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పార్టీ ముందస్తుగా ప్రత్యే క పాసులను జారీ చేసింది. తద్వారా ఈ పాస్లు ఉన్న వారు మాత్రమే సభకు హాజరు కావాలని మంత్రి కేటీఆర్ వేదిక ద్వారా కోరారు. సభకు రాలేని పార్టీ ప్రతినిధులంతా తమ పరిధిలో ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.
తిలకించేందుకు పది భారీ స్క్రీన్లు..
సభా వేదిక ప్రాంగణంలోకి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు కలిపి ప్రత్యేక ఆహ్వానితులుగా 3500 మాత్రమే ఉండబోతున్నారు. ఇందులో సుమారు 500 నుంచి 1000 మంది వరకు మహిళలు హాజరుకానున్నారు. 300 మంది మీడియా ప్రతినిధులను సభలోకి అనుమతించబోతున్నారు. అయితే, ప్రత్యక్షంగా 3500 మాత్రమే వేదిక ద్వారా వేడుకలను ప్రత్యక్షంగా చూసినా, హైటెక్స్ ప్రాంగణంలో పది వరకు భారీ స్క్రీన్లు ఏర్పా టు చేసి మరో 8 వేలకు పైగా వేడుక విశేషాలను తిలకించేందుకు ఏర్పాటు చేశారు. భోజనాలను సైతం 12వేల మంది వరకు ఏర్పాటు చేస్తున్నారు.
పది అంశాలతో కూడిన బ్యాగ్ కిట్
రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరుకానుండటంతో వారి పేర్ల నమోదు, పార్టీ తరపున కిట్లను అందించేందుకు గాను జిల్లాల వారీగా 33 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పాస్ స్కాన్ అనంతరం వేదికలోకి వెళ్లే పార్టీ శ్రేణులతో ప్రత్యేక బ్యాగ్, తీర్మానాల పుస్తకం, స్నాక్స్, పెన్ను, మాస్కు, సానిటైజర్, పార్టీ జెండా, పార్టీ కండువా సహా మొత్తం 10 అంశాలతో ఉన్న బ్యాగ్ను పార్టీ శ్రేణులకు కౌంటర్లలో అందించనున్నారు. వేడుకలకు హాజరైన ఆహూతులందరికీ ఈ బ్యాగ్ కిట్లను అందించనున్నట్లు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రత్యేక ద్వారాలు.. కళాకారులచే ప్రదర్శనలు
సభా వేదికకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక ద్వారం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి విఐపీలు చేరుకునేందుకు ప్రత్యేక ద్వారం, ప్రత్యేక ఆహ్వానితులు చేరుకునేందుకు ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు. సభా వేదికపై 200 మందిని ప్రముఖులను ఆహ్వానించనున్నారు. వేదికపై సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన, పార్టీ జెండా ఆవిష్కరణ, తెలంగాణ తల్లికి అమల వీరుల స్థూపానికి నివాళులర్పించే ఏర్పా ట్లు చేశారు. సభా వేదికపై 80 ఫీట్ల భారీ డిజిటల్ స్రీన్ ను అమర్చారు. అందులో 35 ఫీట్ల మేర సంక్షేమ పథకాలపై ప్రచారం కాగా, మిగిలిన స్థలంలో వేదిక కార్యక్రమ లైవ్ను అందించనున్నారు. సభా వేదికకు ఎడమ వైపు 60 మంది కళాకారులు ఏక కాలంలో వేదికపై కళా ప్రదర్శనలు.. పాటలు ఆలపించే వేదికను ఏర్పాటు చేశారు.
14 ఏండ్ల ప్రస్థానంపై ఫొటో ప్రదర్శన
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో 14 ఏండ్ల పాటు కొనసాగిన ఉద్యమ పంథాను కండ్లకు కట్టేలా వేదిక సమీపంలో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మొత్తం 1500 ఫొటోల ద్వారా 14 ఏండ్ల పార్టీ ప్రస్థానం, స్వరాష్ట్ర సాధన అనంతరం రెండు దఫాలుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన స్వపరిపాలన, ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 34 ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మూడు ప్రత్యేక వాల్స్ ఏర్పాటు చేసి, ఓ వాల్పై 14 ఏండ్ల పార్టీ ప్రస్థానం, రెండో వాల్పై దేశ రాజధానిలో సీఎం కేసీఆర్ కేంద్రంపై కొనసాగించిన పోరు, మూడో వాల్పై 34 సంక్షేమ పథకాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
చరిత్ర సృష్టించబోతున్న టీఆర్ఎస్..
పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకానున్న ప్రత్యేక ఆహ్వానితులకు అందిస్తున్న పాస్లు పూర్తిగా సాంకేతికమైనవి. కేవలం పాస్లు ఉన్న వారినే ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్న 20 ప్రత్యేక కౌంటర్ల ద్వారా సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ముందస్తుగా వీరికి జారీ చేసిన పాస్లను ప్రత్యేక కౌంటర్లలో స్కాన్ చేసిన మీదటే లోపలికి పంపుతారు. దేశ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఈ తరహా సాంకేతిక పాస్ల ద్వారా ఆహూతులను సభలోకి అనుమతించబోతున్నారు. వీటి ద్వారా పాస్లు పొందిన వారు కాకుండా మరొకరు వేదికకు చేరుకోలేరు. ఈ తరహా సాంకేతికను అమలు చేయబోతున్న పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టింబోతున్నది.
భోజన వసతి..
సభా వేదికకు వెనకవైపు సీఎం సహా మరో 300 మంది భోజనాలు చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులందరికీ హైటెక్స్ ప్రాంగణంలోని హాల్ 1, 3లలో, మీడియా ప్రతినిధులకు హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లోని రెండో అంతస్థులో భోజన వసతిని కల్పిస్తున్నారు. సభా వేదిక ప్రాంగణంలో వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితుల, ఆహ్వానితులకు ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పించారు.