ఎల్బీనగర్, ఆగస్టు 21 : బీసీ బంధు పథకంతో బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ బంధు పథకానికి ఎంపికైన 300 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ… కులవృత్తులకు జీవం పోయడమే కాకుండా, ప్రతి కార్మికుడిని యజమాని చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీసీ బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు విఠల్రెడ్డి, భవాని ప్రవీణ్, సాగర్రెడ్డి, తిరుమల్రెడ్డి, నాయకులు వెంకటేశ్ గౌడ్, కృష్ణ, డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, రాహుల్గౌడ్, శ్రీశైలం యాదవ్, మహేశ్యాదవ్ పాల్గొన్నారు.