న్యూఢిల్లీ : కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. పంజాబ్ పాటియలాలోని నభా ఓపెన్ జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది. వీరిందరిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే నెగిటివ్ వచ్చిన ఖైదీలకు త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో పంజాబ్లో కొత్తగా 2,914 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 59 మంది చనిపోయారు. దీంతో పంజాబ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,602కు చేరింది. నిన్న ఒక్కరోజే జలంధర్లో 13 మంది, లుధియానాలో 11 మంది, హోషియాపూర్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు పంజాబ్లో కరోనాతో 6,749 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి..