హైదరాబాద్ : కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలోని చర్లపల్లిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రామాలయం సమీపంలో స్వాతి (19) అనే యువతి ఇంట్లో ఉరి వేసుకున్నది. మరో వ్యక్తి చర్లపల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వేర్వేరు ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.