Ganja | హైదరాబాద్ : బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులు మొహమ్మద్ ఉద్దీన్, షేక్ సోహైల్, మొహమ్మద్ అఫ్జల్ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన మహేశ్ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని సంచుల్లో నింపి జీడిపప్పు కింద దాచిపెట్టి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి సరఫరాలో రెహమాన్ ప్రధాన రవాణాదారుడిగా గుర్తించారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా చిన్ననాటి స్నేహితులుగా దర్యాప్తులో తేలింది.