Hyderabad | హైదరాబాద్ : సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, కొల్లూరు పోలీసులు కలిసి మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కారు, రెండు మొబైల్స్ను సీజ్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన కార్తీక్ రవి(24), కమల్ సంజయ్ సిర్సాత్(23), రాజా భాయి అనే ముగ్గురు యువకులు కలిసి వైజాగ్కు చెందిన రాజేశ్ అనే వ్యక్తితో 125 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కిలో గంజాయిని రూ. 3 వేల చొప్పున కొన్నారు. ఆ గంజాయిని రవి, సంజయ్ కలిసి కారులో మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా, హైదరాబాద్లో పోలీసులకు పట్టుబడ్డారు. మరో ఇద్దరు రాజా భాయి, రాజేశ్ పరారీలో ఉన్నారు. అయితే ఈ గంజాయిని మహారాష్ట్రలోని అమరావతిలో అత్యధిక ధరకు విక్రయించి, భారీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజా, రాజేశ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.