హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా (Missing) పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా లాభం లేకుండాపోయింది. దీంతో విద్యార్థి తల్లి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు కిడ్నాప్ కేసుగా (Kidnap) నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.