10th Class Exams | సిటీబ్యూరో, మార్చి 17 ( నమస్తే తెలంగాణ ) : పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 76,575 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 15 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 12:30 గంటల వరకు కొనసాగుతుందన్నారు.
ఉదయం 8:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంటుందన్నారు. హాల్ టికెట్లను www.bse.telangana.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.