కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుండటంతో ఆయా దవాఖానాల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసీయూ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ, కింగ్ కో ఠి, టిమ్స్ దవాఖానాలతో పాటు పలు ప్రైవేటు హాస్పిటలలో కూడా కరోనా రోగులకు ప్రత్యేక వార్డులు, ఐసీయూ వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీలో 300 పడకలు, కింగ్కోఠిలో 200 పడకలు, టిమ్స్లో వెయ్యికి పైగా కోవిడ్ పకడకలను అందుబాటులో ఉంచారు. అయితే, శుక్రవారం నాటికి గాంధీలో 136 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, కింగ్కోఠి జిల్లా దవాఖానాలో 38 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వీరితో పాటు ఐసోలేషన్ వార్డుల్లో సైతం రోగు ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం, రోగుల రికవరీ రేటు కూడా బాగానే ఉండటంతో సమస్య లేదంటున్నారు వైద్యులు. అయితే వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో కేసులు పెరిగే అవకాశముందని దీనిని దృష్టి లో పెట్టుకుని అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అవసరమైతే కొవిడ్ పడకలను మ రింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఐసీయూ పడకలను సైతం రోగుల రద్దీ ఆధారంగా పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వైద్యాధికారులు వివరించారు. రోగులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు.