Cancer | తరాలు గడుస్తున్నా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా… మనిషిని ఇంకా ఇంకా వేధిస్తున్న సమస్యలలో క్యాన్సర్ ఒకటి. దీనికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా, ఏవీ పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించడం లేదు. దుష్ఫలితాలు లేని మందులూ రావడం లేదు. ఇందుకు విరుగుడుగా, మనలోని రోగ నిరోధక శక్తినే క్యాన్సర్ కణాల మీద దాడికి ప్రేరేపించే ‘ఇమ్యునోథెరపీ’కి ప్రాధాన్యం పెరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు ఓ కీలక ఆవిష్కరణ చేశారు యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు.
శరీరంలో క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేందుకు బి సెల్స్, టి సెల్స్ అనే కణాల మధ్య సమన్వయం జరగడాన్ని వీరు గమనించారు. బి సెల్స్ క్యాన్సర్కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తే, టి సెల్స్ క్యాన్సర్ కణాల మీద దాడి చేస్తుంటాయి. వాటి పనితీరును, సమన్వయాన్నీ గమనించిన పరిశోధకులు ఈ రెండు కణాలను కనుక సహజంగా పెంచగలిగితే… క్యాన్సర్ను పూర్తిగా, సహజంగా నాశనం చేయవచ్చని నిపుణులు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి