న్యూయార్క్ : అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారిని అనారోగ్య సమస్యలు వెంటాడటంతో పాటు వారికి అకాల మరణం ముప్పు 22 శాతం నుంచి 91 శాతం వరకూ పొంచిఉంటుందని తాజా అధ్యయనం (Health Tips )వెల్లడించింది. అత్యధిక బీఎంఐ కలిగిన కేసుల్లోనే అధిక బరువు మరణాల ముప్పును పెంచుతుందనే వాదనను పాపులేషన్ స్టడీస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం తోసిపుచ్చింది.
హృద్రోగాలు, బీపీ, మధుమేహం మరణాల ముప్పును పెంచుతాయనే పలు అధ్యయనాలు వెల్లడించగా అందుకు విరుద్ధంగా అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గ్రూపుల్లో అధిక మరణాల రేటు ఉంటుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అధిక బీఎంఐ మరీ అత్యధికంగా ఉంటే తప్ప సాధారణంగా ఇది మరణాల ముప్పు పెంచదని గతంలో భావించేవారని యూనివర్సిటీ ఆఫ్ కొలరడో సోషియాలజీ ప్రొఫెసర్, అధ్యయన రచయిత ర్యాన్ మాస్టర్స్ పేర్కొన్నారు.
4468 మరణాలు సహా 17784 మంది డేటాను మాస్టర్స్ పరిశీలించి ఈ వివరాలు నిగ్గుతేల్చారు. ఇక తక్కువ బీఎంఐ (18.5-22.5) ఉన్నవారిలో మరణాల ముప్పు అత్యల్పమని మాస్టర్స్ గుర్తించారు. గత అధ్యయనాలకు భిన్నంగా బరువు తక్కువగా ఉన్న కేటగిరీలో మరణాల ముప్పు గణనీయంగా లేదని తాజా అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. బీఎంఐ ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చే విషయంలో తమ పరిశోధన శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తుందని మాస్టర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :