న్యూఢిల్లీ : మండు వేసవిలో ఫిట్గా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే అందుకు అవసరమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు, డీప్ హెల్త్ కోచ్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ఎండ వేడిమితో చికాకు, ఏకాగ్రత లేమి, శారీరకంగా అలిసిపోవడం, నిద్ర లేవి వేధిస్తుంటాయని ఈ సమయంలో వేయించిన ఆహార పదార్ధాలు, సమోసా పిజ్జా వంటి జంక్, స్ట్రీట్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు.
చిల్లీ, పెప్పర్, అల్లం ఎక్కువగా వేసిన ఆహార పదార్ధాలు తీసుకోకూడదని చెబుతున్నారు. నూనె ఎక్కవుగా వేసి చేసే కూరలనూ తగ్గించాలని చోప్రా చెప్పుకొచ్చారు. రెడ్ మీట్ కూడా శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుందని అన్నారు. వేసవిలో తండూరీ ఐటెమ్స్ తీసుకుంటే గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు.
వేసవిలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, మామిడి వంటి తాజా పండ్ల రసాలు, గ్రీన్ టీ తీసుకోవాలని పోషకాహార నిపుణులు ప్రతీక్ బేడీ సూచించారు. చక్కెర అధికంగా ఉండే ప్యాకేజ్డ్ జ్యూస్లను పక్కనపెట్టాలని చెప్పారు. తాజా కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలని సూచించారు.