న్యూడిల్లీ : ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ (Dengue) సహా పలు వైరస్లు ప్రాణాంతకంగా మారి వేగంగా ప్రబలుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. డెంగ్యూతో పోరాడేందుకు 20 కోట్ల ప్రత్యేక దోమలను విడుదల చేయాలని ఇండోనేషియా కసరత్తు సాగిస్తోంది. ఈ స్పెషల్ దోమలు డెంగ్యూ, జికా, యల్లో ఫీవర్ల వ్యాప్తిని నిరోధిస్తాయి.
ప్రత్యేక దోమలు డెంగ్యూ కేసులను ఏకంగా 77 శాతం తగ్గిస్తాయని ఇండోనేషియా అధికారులు పేర్కొంటున్నారు. దోమల్లో వైరస్ల వృద్ధిని నిరోధించే వొల్బచియ అనే బ్యాక్టీరియాను ఈ ప్రత్యేక దోమలకు ఎక్కించి విడుదల చేస్తారు.
ఈ దోమలను స్మాల్ శాంపిల్స్పై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అయితే ప్రత్యేక దోమలను విడుదల చేయడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరించడంతో ప్రత్యేక దోమలతో డెంగ్యూపై దండయాత్ర కార్యక్రమాన్ని ఇండోనేషియా ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఇక ఏటా 10 కోట్ల నుంచి 40 కోట్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.
Read More :
Bullet train station | దేశంలో తొలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇదే.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి