చెన్నై : పాలల్లో కల్తీని కేవలం 30 సెకండ్లలోనే పసిగట్టే పేపర్ ఆధారిత 3డీ డివైజ్ను ఐఐటీ మద్రాస్ (IIT Madras) పరిశోధకులు అభివృద్ధి చేశారు. కల్తీ పాల వాడకాన్ని అరికట్టేందుకు ఈ పరికరాన్ని సులభంగా ఇంట్లో వాడుకోవచ్చు. పాలల్లో కలిపే యూరియా, సోప్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోజన్-కార్బోనేట్, ఉప్పు వంటి పలు పదార్ధాలను ఈ 3డీ డివైజ్ గుర్తిస్తుంది.
ఇతర పరికరాలతో పోలిస్తే తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈ పరికరంతో నీరు, జ్యూస్లు, మిల్క్ షేక్ల వంటి ఇతర ద్రవాల్లోనూ కల్తీని పరీక్షించవచ్చు. ఈ పరీక్ష కోసం ఏ ద్రవమైనా మిల్లీలీటర్ శాంపిల్గా సరిపోతుంది.
రీసెర్చి స్కాలర్లు సుభాషిస్ పటారి, డాక్టర్ ప్రియాంకన్ దత్తాలతో కలిసి ఈ పరిశోధనకు ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పల్లవ్ సింహ్ మహాపాత్ర నేతృత్వం వహించారు. వీరంతా పరిశోధనా పత్రాన్ని కూడా రూపొందించారు. ద్రవాహారాల ఫుడ్ సేఫ్టీని ఈ డివైజ్తో పర్యవేక్షించవచ్చని, మారుమూల ప్రాంతాల్లో కల్తీ పాలను ఈ పరికరంతో సులభంగా గుర్తించవచ్చని డాక్టర్ పల్లవ్ సింహ్ పేర్కొన్నారు.
Read More :
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు