Control Blood Sugar Levels | డయాబెటిస్ ఉన్నవాళ్లు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో రక్తంలోని చక్కెరస్థాయులు ఆకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు షుగర్ లెవల్స్ను కంట్రోల్లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ను కంట్రోల్లో పెట్టవచ్చు. మరి చలికాలంలో మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎలాంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
♥ మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఉండే ప్రొటీన్స్, విటమిన్ సీ వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కమలాలు, బత్తాయిలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గుతుంది. ఈ సీజన్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి హ్యాపీగా తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.
♥ జామకాయలో విటమిన్ ఏ, సీలు చక్కెర స్థాయిని సులువుగా తగ్గిస్తాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొవ్వుని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. పేదవాడి ఆపిల్గా పిలిచే వీటిని తినడం వల్ల షుగర్ పేషెంట్స్కు చాలా మేలు జరుగుతుంది.
♥ మిగతా పండ్లతో పోలిస్తే కివీ పండ్ల ధర కాస్త ఎక్కువే. అయినా ఇవి ఆరోగ్యానికి చేసే మేలు మాత్రం అధికం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ మేలు చేస్తాయి.
♥ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సమయంలోనైనా వీటిని తినొచ్చు. ఈ పండు తినడం వల్ల మలబద్దకం దూరం అవుతుంది.
“Health Tips | రోజూ నాలుగు కప్పుల టీతో తగ్గనున్న మధుమేహ ముప్పు”