న్యూఢిల్లీ : రోజులో పలుమార్లు టీ తాగడం వల్ల టైప్ టూ డయాబెటిస్ తగ్గముఖం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం టీ సేవించడంతో మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు దాని లక్షణాలనూ తగ్గిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగడం ద్వారా మధుమేహ ముప్పు గణనీయంగా తగ్గినట్టు ఎనిమిది దేశాల్లో నిర్వహించిన 19 అధ్యయనాల్లో వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్పై బ్లాక్, గ్రీన్ టీ వినియోగం ప్రభావాన్ని ఈ అధ్యయనం అంచనా వేసింది. రోజూ టీ తాగడం ఆరోగ్యానికి హానికరం కాదని, పైగా డయాబెటిస్ ముప్పును ఇది తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సెంటర్ ఫర్ డయాబెటిస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కసిఫ్ ఎం. మునిర్ పేర్కొన్నారు.
పాలీపెనాల్స్ అధికంగా ఉన్న ఆహారంలో కూడా ఇవే ప్రభావాలు కనిపించాయని స్టాక్హోంలో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్లో ఈ అధ్యయన వివరాలను సమర్పించారు. ఇక రోజూ టీ తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఛాయ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
మెరుగైన జీర్ణశక్తి
మానసిక ఆరోగ్యం మెరుగుదల
బరువు తగ్గడం
ఒత్తిడి మటుమాయం
శారీరక ఉత్తేజం