న్యూఢిల్లీ : చలికాలంలో జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. వణికించే చలికి తోడు వాతావరణ కాలుష్యం పలు అనారోగ్యాల బారినపడేలా చేస్తుంది. ఇక చలికాలంలో ఆహారం అధికంగా తీసుకునే క్రమంలో ప్రేవుల ఆరోగ్యాన్ని (Gut Health) కాపాడుకోవడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రేవుల ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవడం కీలకమని గురుగ్రాంకు చెందిన మణిపాల్ హాస్పిటల్ ఇంట్నల్ మెడిసిన్, డయబెటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ శరణ్ సూచిస్తున్నారు.
వింటర్లో జంక్, ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలని, ఇవి జీర్ణక్రియను దెబ్బతీసి కడుపుబ్బరం, వికారానికి దారితీస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రేవుల ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు తాజా పండ్లు, వండిన కూరగాయలు, పపక్పు ధాన్యాలు, బీన్ప్, సీడ్స్ అధికంగా తీసుకుంటూ స్పైసీ ఫుడ్స్ను దూరం పెట్టాలని చెబుతున్నారు. అతిగా తినడం సరికాదని, చలికాలంలో డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలని డాక్టర్ మోహిత్ శరణ్ వివరించారు. ఇక నిద్రలేమి, ఒత్తిడితోనూ ప్రేవుల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు.
రోజూ తగినంత నీరు తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగి మలబద్ధకం దరిచేరదని చెప్పారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని ఇది ప్రేవుల ఆరోగ్యానికి ఉపకరిస్తుందని తెలిపారు. సమతులాహారం తీసుకుంటూ రోజుకు అరగంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరమని తెలిపారు.
Read More :
Thandel | నాగచైతన్య తండేల్లో సాయిపల్లవి సోదరిగా కనిపించేది ఈ భామేనట..!