న్యూఢిల్లీ : రుచికరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ఎవరైనా ఇష్టపడతారు. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని(Health Tips) తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం మూడు ఆహార పదార్ధాలను నిత్యం తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వైశాలి శుక్లా చెబుతున్నారు.
ఈ మూడు ఆహార పదార్ధాలను తాను నిత్యం తన ఆహారంలో భాగం చేసుకుంటానని ఆమె వెల్లడించారు. రైస్తో చేసిన ఆహార పదార్ధాలు ప్రతి రోజూ రాత్రి ఏడు గంటల్లోపు తీసుకోవాలని, ఇది మనం నిద్రించేలోపు జీర్ణం అవుతుందని చెప్పారు. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్ధ చక్కగా పనిచేస్తుందని జీవక్రియల వేగం పెరగడంతో పాటు నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుందని అన్నారు.
కూరగాయలు, పప్పు ధాన్యాలు, సూప్లతో పాటు రైస్ తీసుకోవాలని అన్నారు. ఇక డేట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో డేట్స్ ఉండేలా చూసుకోవాలి. ఐరన్ లెవెల్స్ మెరుగ్గా ఉండటంతో పాటు కండర పుష్టికి ఇవి మేలు చేస్తాయి. రైస్, డేట్స్తో పాటు ఉడకబెట్టిన పెసలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్ అధికంగా ఉండటంతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.