న్యూఢిల్లీ : ప్రాణాంతక గుండె పోటుతో (Health Tips) నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కండరానికి రక్త సరఫరా తగ్గుముఖం పడితే గుండె పోటు ముప్పు పెరుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడితే గుండె దెబ్బతినడంతో పాటు మరణం సంభవిస్తుంది. గుండె పోటుకు ముఖ్యమైన కారణాల్లో ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోవడమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాట్, కొవ్వుల వంటి అనారోగ్య కారక వ్యర్ధాలు శరీరంలో పేరుకుపోవడంతో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇక చల్లటి నీరు, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన నీరు తాగితే ముఖ్యంగా హృద్రోగుల్లో గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటుచేసుకుని తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో బాధపడేవారు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వారిలో చల్లటి నీరు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించినా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారిలో మాత్రం హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చల్లటి నీరును సేవించగానే ముఖ్యంగా హృద్రోగుల్లో కొద్ది క్షణాల్లోనే గుండె పోటు వంటి సీరియస్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్కు సరిపోయే రీతిలోనే హైడ్రేట్ కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానంతరం గోరువెచ్చటి నీరు తీసుకుంటే మేలని, అది జీర్ణక్రియకు దోహదపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రూం టెంపరేచర్తో కూడిన నీటిని తీసుకుంటే శరీరంలో కీలక అవయవాలు సజావుగా పనిచేయడంతో పాటు శరీరం అంతటికీ పోషకాలు, ఆక్సిజన్ సమకూరుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంతో పాటు గుండె కొట్టుకునే వేగం నిలకడగా ఉంటుందని వైద్య నిఫుణులు సూచిస్తుందని అన్నారు.
Read More