న్యూఢిల్లీ : పార్కిన్సన్స్ వ్యాధి నియంత్రణకు ఢిల్లీ వైద్యులు మెదడు లోపల పేస్మేకర్ను అమర్చి ఓ మహిళకు నూతన జీవితం ప్రసాదించారు. గత తొమ్మిదేండ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న సావిత్రి దేవి (51) అనే మహిళకు నరాల డిజార్డర్ను సరిచేసేందుకు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆమె మెదడులో పేస్మేకర్ను అమర్చారు.
దేవికి తరచూ వణుకు రావడం, కదలికల్లో ఇబ్బందులు, రిజిడిటీ వంటి లక్షణాలు బయటపడగా క్రమంగా అవి మరింత పెరగడంతో ఆమె నడిచేందుకు, కనీసం బెడ్పై నుంచి లేచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమె కాళ్లు, చేతులు కూడా నియంత్రణ కోల్పోయి కదులుతుండేవి. ఆపై మందుల నుంచి కూడా ఆమెకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలైంది.
ఆమె పరిస్ధితిని పరిశీలించిన సర్ గంగారాం ఆస్పత్రి వైద్యులు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్గా పిలిచే మెదడులో పేస్మేకర్ అమర్చే ప్రక్రియను సూచించారు. మెదడులో నిర్ధిష్ట భాగాలను ప్రేరేపించే నూతన సర్జరీగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ను వ్యవహరిస్తారు. వ్యాధిని నియంత్రించి రోగి జీవనశైలిని మెరుగుపరిచేందుకే ఈ సర్జరీ ఉద్దేశమని న్యూరోసర్జరీ విభాగం అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రేయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read More