ఆదర్శంగా నిలుస్తున్న కర్ణంగూడ గ్రామం
ఇబ్రహీంపట్నం రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉన్న త ఆశయంతో ప్రవేశపెట్టిన హరి తహారం కార్యక్రమం ఇబ్ర హీం పట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామం అగ్రస్థా నంలో నిలుస్తున్నది. ప్రతి ఏడాది వర్షాలు కురియక ముందే వివిధ రకాల మొక్క లు నర్సరీలో సిద్ధం చేస్తున్నా రు. నర్సరీ మొక్కల పెంపకా నికి ప్రత్యేక స్థలం లేకపో యిన ప్పటికీ సర్పంచ్ కవితా తిరుమల్రెడ్డి పంచాయతీ ఆవరణలోనే మొక్కల పెంపకానికి నర్సరీని ఏర్పా టు చేశారు. మొక్కలు ఎండకు ఎండిపోకుండా గ్రీన్మ్యా ట్ను ఏర్పాటు చేసి మొక్కలను ప్రతిరోజూ కంటికి రెప్ప లా కాపాడుతూ సిద్ధంగా ఉంచారు. గత హరితహా రం లో గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సం రక్షణకు ప్రత్యేకంగా కృషిచేశారు. ఈ ఏడాది కూడా గ్రా మంలో అత్యధికంగా మొక్కలు నాటి వాటిని సంరక్షిం చేందుకు కృషిచేయడంతో పాటు గ్రామాన్ని హరిత వ నంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.