Diabetic Drinks | మార్చిలోనే భానుడి ప్రతాపంతో ఎండ తాకిడి మొదలైంది. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్ధితి. వేసవి తాపం తీర్చుకునేందుకు జనం పండ్ల రసాలు వంటివి తీసుకోవడం సహజం. అయితే మధుమేహులు తమ షుగర్ లెవెల్స్ పెంచని సమ్మర్ డ్రింక్స్ను ఎంచుకోవడం మేలు.
ఎలాంటి పరిస్ధితులోనూ పండ్ల నుంచి తీసిన రసాన్ని మధుమేహులు తీసుకోరాదని బెంగళూర్కు చెందిన డైటీషియన్ నిధి నిగం హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్లో పండులో ఉన్నంత ఫైబర్ ఉండదని దీంతో వెనువెంటనే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. అయితే ప్రత్యామ్నాయ సమ్మర్ పానీయాలతో మధుమేహులు తమ దాహార్తి తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు.
డయాబెటిక్తో బాధపడేవారు వారి షుగర్ లెవెల్స్ పెరగకుండానే హైడ్రేట్గా ఉండేందుకు ఇంటి నుంచే కొన్ని సహజసిద్ధమైన, ఆరోగ్యకర కూలింగ్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చని డైటీషియన్ కవితా దేవ్గన్ చెబుతున్నారు. భోజనానికి ముందు ఈ సమ్మర్ డ్రింక్స్ తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఇక మధుమేహులకు అనువైన సమ్మర్ డ్రింక్స్ను పరిశీలిస్తే..
సబ్జా సీడ్స్తో కొబ్బరి నీరు
చియా సీడ్ డ్రింక్
కోకుమ్ షర్బత్
మజ్జిగ
క్రాన్బెర్రీ జ్యూస్
వెజిటబుల్స్ జ్యూస్
Read More :
Padmaja Venugopal: బీజేపీలో చేరనున్న కేరళ మాజీ సీఎం కూతురు