తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్(Padmaja Venugopal).. ఇవాళ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలతో ఈ అంశంపై ఆమె చర్చించనున్నారు. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. పార్టీ అగ్రనాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. తనను పక్కనపెట్టినట్లు భావిస్తున్న ఆమె.. బీజేపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఇటీవల ఎన్నికల ర్యాలీలో ప్రియాంకా గాంధీ వాహనంలోకి ఎక్కకుండా పద్మజా వేణుగోపాల్ను అడ్డుకున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఆమె త్రిసూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ముకుందపురం నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. తన తండ్రి కే కరుణాకరన్కు స్మారక నిర్మించడంలో కాంగ్రెస్ సర్కార్ జాప్యం చేసిందని, అందుకే పద్మజా.. బీజేపీ వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది.