చినుకుల కాలం మొదలవగానే వాతావరణం చల్లబడిందని సంతోషపడతాం. అయితే, ఈ సంతోషాల వెంటే దుఃఖాలు కూడా మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో వచ్చే సీజనల్ జ్వరాలు మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డెంగీ జ్వరం. అన్ని జ్వరాలు ఒకేలా ఉన్నా.. డెంగీగా అనుమానించొద్దు. డెంగీ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయో తెల్సుకుని, వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో విజ్ఞానం పొందడం ద్వారానే దానిని దూరంగా తరిమేయవచ్చు.
దోమలు కుట్టడం వల్ల మనకు వచ్చే విష జ్వరాల్లో డెంగీ కూడా ఒకటి. డెంగీ వైరస్లో ఎన్నో ఉపరకాలు ఉన్నాయి. ఇది ఏడిస్ రకానికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లోనే కుడతాయి. ఈ దోమలు కుట్టగానే మన శరీరంలో డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫలితంగా మనకు అనేక డెంగీ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకం దోమలు ఎక్కువ దూరం ఎగరలేనందున ఒకే వ్యక్తిని ఎక్కువ సార్లు గానీ, అక్కడే ఉన్న ఇతరులను గానీ కుడతాయి.
డెంగీ లక్షణాలు
డెంగీ వైరస్ సోకిన వ్యక్తిలో దాదాపు వారం రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. డెంగీ సాధారణ జ్వరంలా రావచ్చు. తీవ్ర రక్తస్రావం అయి ప్రాణాంతకం కావచ్చు. మెదడు వంటి ఇతర అవయవాలపై ప్రభావం చూపి మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి.
జ్వరం బాగా వచ్చిన వారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం పాటు జ్వరం ఉంటే ఆలస్యం చేయకూడదు. పాజిటివ్ వస్తే వైద్యులు రోగిని హాస్పిటల్లో చేర్చుకుని చికిత్స ప్రారంభిస్తారు. అయితే చికిత్స సమయంలో రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు సమయానికి వేసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దోమలు లేకుండా చూసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నివారణ ఇలా..