న్యూఢిల్లీ : శీతల గాలులతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిపులి పంజాకు ప్రజలు వణుకుతున్నారు. వింటర్లో చలి వాతావరణానికి తోడు వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, దగ్గు, జలుబు (Boost Immunity) వెంటాడుతున్నాయి. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధక వ్యవస్ధ బలోపేతంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సీజన్లో చలికి తోడు కాలుష్యం ఇమ్యూనిటీని దెబ్బతీయడం ద్వారా పలు ఇన్ఫెక్షన్లతో పాటు శ్వాసకోశ వ్యాధుల ముప్పును పెంచుతుంది. ఈ సీజన్లో రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం కోసం పండ్లు, కూరగాయలు, విటమిన్స్, మినరల్స్తో కూడిన సమతులాహారం తీసుకోవాలి. విటమిన్ సీ, జింక్, ఐరన్తో కూడిన ఆహారాలు మన రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరుస్తాయి.
ఇక ఈ సీజన్లో పోషకాలను శరీరంలోని కణాలకు చేరవేసి, వ్యర్ధాలను బయటకు పంపే వ్యవస్ధ సవ్యంగా పనిచేయాలంటే తరచూ తగినంత నీరు తీసుకోవాలి. డీహైడ్రేషన్కు గురిచేసే మద్యాన్ని మితంగా తీసుకుంటూ రోజుకు కనీసం 2 లీటర్లు పైగా నీటిని తీసుకోవాలి. ఇక వింటర్లో ఇమ్యూనిటీ మెరుగుపడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి
సమతుల పోషకాహారం
హైడ్రేషన్
విటమిన్ డీ సప్లిమెంట్స్
వ్యాయామం
తగినంత నిద్ర
పరిశుభ్రత పాటించడం
వ్యాక్సినేషన్
Read More :
Dhokla Chaat | ఈ వెరైటీ ఫుడ్ కాంబోపై నెటిజన్ల రుసరుస