తమిళ అగ్ర నటుడు అజిత్కుమార్ తాజా చిత్రం ‘డేర్డేవిల్’ సెప్టెంబర్లో సెట్స్మీదకు వెళ్లనుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ కమర్షియల్ హంగులతో తెరకెక్కించబోతున్నారు. షాలిని అజిత్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ పాన్ ఇండియా సినిమాలో కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్రబృందం అగ్ర నటుడు వెంకటేష్ను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. కథాగమనంలో ఈ గెస్ట్రోల్ చాలా కీలకంగా ఉంటుందని, స్క్రీన్స్పేస్ కూడా చాలా ఎక్కువేనని చెబుతున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించడం దాదాపు ఖాయమైందని తమిళ సినీవర్గాల్లో వినిపిస్తున్నది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇదే సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కోసం చిత్రబృందం మలయాళ అగ్రహీరో మోహన్లాల్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మొత్తానికి స్వీయ నిర్మాణంలో అజిత్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘డేర్డెవిల్’ చిత్రం నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.