నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిమ్మ, పసుపు కలిపి తీసుకుంటే శరీరంలోని అనేక సమస్యలు, వ్యాధులు దూరం అవుతాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలుపుకుని తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
చర్మం సంరక్షింపబడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం పగలకుండా ఉంటుంది.
వీటిని నిత్యం తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు.
వీటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఫేస్ మాస్క్గా, ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించవచ్చు. వీటిని వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది.
నిమ్మ, పసుపు తీసుకోవడం వల్ల గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు.
మానసిక ఆరోగ్యానికి ఈ కలయిక ఎంతో మేలు చేస్తుంది.
వీటిలోని యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ డిప్రెసెంట్ గుణాలు మనలో ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. స్టోన్స్ ఏర్పడకుండా చూస్తుంది.