Heart Attack | రోజుకో గుండె పోటు.. అది కూడా యువతకే ఎక్కువ.. ఈ రెండు, మూడేండ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే.. ముఖ్యం గా కరోనా తర్వాత యువ గుం డెకూ గాయాల పోటు తగులుతున్నది. 40 ఏండ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి సర్కుల్యేషన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కొవిడ్-19 బారినపడి చికిత్స తీసుకొన్నవారిలో 61 శాతం మందికి గుండె పోటు సహా ఇతర గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తెలిసింది. కొవిడ్ టీకా తీసుకున్న కొందరిలో గుండె పోటు, హృద్రోగాల సమస్యలు వచ్చాయని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. హృదయ స్పందన(హార్ట్ బీట్)లో సమస్యలు కూడా గుండె పోటుకు కారణమవుతాయని సెంటర్ ఫర్ ఇం టిగ్రేటివ్ మెడికల్ సైన్సెస్ పరిశోధనలో తేలింది. నిర్దిష్టమైన జన్యు పరమైన వైవిధ్యాలకు, హృదయ స్పందన సమస్యలకు సంబంధం ఉందని ఈ పరిశోధన తెలిపింది. దీర్ఘకాలం గాలి కాలుష్యం బారిన పడినవారిలోనూ గుండె పోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని జామ నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది.
కొవిడ్-19, మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి వల్ల యువతలో గుండె పోటు ఘ టనలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండె దడ, ఆందోళన, వ్యా యామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వల్ల కూడా గుండెపోటుకు గురవుతున్నారు. హృదయ స్పందనలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండెలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని, ఇదే రక్తం మెదడుకు వెళ్లినప్పుడు అక్కడ కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ధమనులు చిట్లడం, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా గుండెపోటుకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. కొవిడ్ నుంచి బయటపడిన వారిలోనూ ఈ సమ స్య ఉండటం వల్ల గుండె పోటు సంభవిస్తున్నదని వివరించారు. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతున్నదని, ఇది గుండె జబ్బులకు దారి తీస్తున్నదని వైద్యులు చెప్తున్నారు.
హైదరాబాద్కు చెందిన విశాల్… 30 ఏండ్ల యువకుడు. జిమ్లో వ్యాయామం చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అతడు గుండె పోటుతో మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాకు చెందిన ఓ దంత వైద్యుడు (30) పెండ్లి మండపంలో ఏడడుగులు వేస్తూ కుప్పకూలిపోయాడు. అతడి మరణానికి కారణం… గుండె పోటే. గుజరాత్లో కొన్ని గంటల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు.. పెండ్లి పందిరిలోనే స్పృహ తప్పి పడిపోయింది. చిన్న వయస్సులోనే ఆమె మరణానికి కారణం… గుండె పోటు. ఒకప్పుడు 60 ఏండ్లు దాటినవారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు 25 ఏండ్ల వయస్కులనూ పీడిస్తున్నది. కొవిడ్ తర్వాత ఈ తరహా ఘటనలు పెరగడం కలవరం కలిగిస్తున్నది.
గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలు ముంబైవాసుల్లో పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక కొలెస్ట్రాల్తో బాధ పడుతున్నట్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 18-69 ఏండ్ల వయస్సు వారిలో 37 శాతం మంది పొగాకు వినియోగం, తక్కువ శారీరక శ్రమ, అధిక బరువు, రక్తపోటు, మధుమేహంతో గుండె జబ్బులకు గురవుతున్నారని సర్వేలో తేలింది. రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తుండగా ముంబైవాసులు 8.6 గ్రాములు తీసుకుంటున్నారు.
కుభీర్, ఫిబ్రవరి 26 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కే) గ్రామంలో శనివారం జరిగిన పెండ్లి వేడుకలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. గ్రామానికి చెందిన న్యాకపు కిష్టయ్య కుమారుడు రాజు పెండ్లి ఈ నెల 24న భైంసా మండలం కామోల్లో జరిగింది. శనివారం రాత్రి పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు స్నేహితులు, బంధువులు డీజే మధ్య డ్యాన్స్ చేస్తున్నారు. మహారాష్ట్ర కిన్వట్ తాలూకా శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే పెండ్లి కొడుకు బంధువు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. డాన్స్లో భాగంగానే అలా చేస్తున్నాడేమోనని అనుకున్నారు. పైకి లేవకపోవడంతో గమనించగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఛాతిపై పంపింగ్ చేశారు. ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో ఊపిరి ఉన్నదన్న నమ్మకంతో భైంసా ఏరియా దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి గుండె పోటుతో మరణించినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని మహారాష్ట్రలోని స్వగ్రామానికి తరలించారు.