జమ్ము: వార్షిక అమర్నాథ్ యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నదని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సీఈవో నితీశ్వర్కుమార్ చెప్పారు. యాత్రికులు తమ పూర్తి వివరాలను www.jksasb.nic. inలో నమోదుచేసి ఫొటో, హెల్త్ సర్టిఫికెట్ను అటాచ్ చేయాలని సూచించారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున గుహలో ఉండే మంచులింగం దర్శన యాత్ర 56 రోజులపాటు ఉంటుందని పేర్కొన్నారు.