జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జమ్మి చెడు గ్రామం దగ్గర వెలసిన
జమ్ములమ్మ అవ్వ కల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని జెడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య దంపతులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వారివెంట గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.