జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని గద్వాల ఎమ్మెల్యేబండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామంలో నూతన మసీదు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసింది. విదేశాలలో వెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ వారి చదువుకు సహకరిస్తుందన్నారు. రంజాన్ పండుగకు ప్రభుత్వం తరఫున కానుకలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అల్లా దయతో దేవుని పట్ల ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ప్రతిరోజు నమాజ్ చేయడం వల్ల మనలోని చెడు ఆలోచనలు తొలిగిపోతాయన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఐక్యతతో గ్రామాభివృద్ధిలో కూడా పాటుపడాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.