జోగులాంబ గద్వాల : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాల ముఖ్య అధికారి సీడీఎస్ బిపిన్ రావత్ ఇతర 12 మంది అధికారులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం రావత్ చేసిన సేవలు మరువలేనివన్నారు.
అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కే.ఎస్. రవికుమార్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఎన్.సి.సి క్యాడెట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.