మహబూబ్నగర్, జూలై 30 : ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని క లెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం క లెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధి త అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లావ్యాప్తం గా గుర్తించిన ఇసుక రీచ్ల నుంచి ఇసుక తరలింపు పారదర్శకంగా ఉండాలని, ఎ లాంటి దాపరికం ఉండకూడదన్నారు. ఇ సుకను తవ్వేందుకు వారంరోజుల ముందే ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులకు తెలియజేసి గ్రామపంచాయతీ తీర్మానాలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలను పటిష్టం చే యాలన్నారు. నెల, మూడు నెలలకు ఎంత ఇసుక అవసరం అవుతుందో ముందుగా ప్రణాళిక రూ పొందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబుల్బె డ్రూం ఇండ్లు, శ్మశానవాటికలకు ఇసుక సమస్య రాకుండా చూడాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
మెట్ట భూముల్లో ఉ ద్యాన పంటల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి బిందు సేద్యం తో సాగు చేస్తున్న టమాట, వంకాయ, గులాబీ తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యానవన డీడీ సాయిబాబా, ఉద్యాన శాఖ అధికారి హిమబిందు, తాసిల్దార్ శంకర్, ఏవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.