ఎగువ, దిగువ జూరాలలో ఆరు యూనిట్లలో ఉత్పత్తి
ఎగువ నుంచిస్థిరంగా కొనసాగుతున్న వరద
ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని యూనిట్లు ప్రారంభం
పర్యవేక్షించిన జెన్కో డైరెక్టర్ వెంకటరాజం
ఆత్మకూరు, జూన్ 10 : ఏరువాక కంటే ముందే వచ్చి న ఏరుతో ముందస్తుగానే జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం నుంచి ఎగువ జూరాలలో ప్రారంభమైన విద్యుదుత్పత్తి.. గురువారం తెల్లవారుజామున దిగువ జూరాలలోనూ ఆరంభమైంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను బట్టి పవర్హౌస్లోని యూనిట్లను రన్ చేస్తున్నారు. ఎగువ జూరాలలో 1, 6, 3 యూ నిట్లలో, దిగువ జూరాలలో 3, 4, 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఎగువ, దిగువ జూరాలలోని జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు జెన్కో డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. రెండురోజులుగా ఎగువ, దిగువ జూరాల ప్రాజెక్టుల్లోనే ఆయన ఉంటూ విద్యుదుత్పత్తిని పర్యవేక్షిస్తున్నారు. ఎగువ నుంచి 20వేల క్యూసెక్కులకు మించి ఇన్ఫ్లో రావడంలేదని, ఇన్ఫ్లో మేరకు మిగిలిన యూనిట్లను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అన్ని యూనిట్లను సైతం సన్నాహక పరీక్షల్లో సన్నద్ధం చేసి ఉంచినట్లు చెప్పారు. ప్రణాళి క ప్రకారం విద్యుత్ ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండి వి ద్యుదుత్పత్తిని పర్యవేక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్ఈలు జయరాం, వర్మ, డీఈలు విన్నూత్, ప్రభాకర్, వేణుగోపాల్, పవన్కుమార్, కృష్ణ, కిశోర్ పాల్గొన్నారు.