గద్వాల, ఏప్రిల్ 22 : నాగర్కర్నూల్ పార్లమెం ట్ ఎన్నికలకు సంబంధించిన కళాకారుల ప్రచార వాహనాన్ని జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎంపీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా,
పదేండ్లలో రాష్ర్టానికి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కా ర్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ఎంపీపీ సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, విజయ్, మోబిన్, వంట భాస్కర్, సతీశ్, కళాకారులు చరణ్ బృందం తదితరులు పాల్గొన్నారు.