లింగాల, ఏప్రిల్ 22 : నల్లమల ప్రాంతంలోని సలేశ్వరం క్షేత్రానికి సోమవారం నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉ త్సవాలను అటవీ శాఖ మూడు రోజులకు అనుమతించడం, రాత్రి వేళ ప్రయాణాన్ని నిషేధించడంతో భక్తు లు ఇబ్బందులు పడుతూనే క్షేత్రాన్ని చేరుకుంటున్నా రు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బ స్సులను నడిపిస్తున్నారు. ‘వస్తున్నాం లింగమయ్య’ నినాదంతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి. సలేశ్వరానికి రెండు మార్గాల ద్వారా భక్తులు తరలుతున్నారు. శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గంలోని ఫరహాబాద్ మీదుగా రాంపూర్, అప్పాపూర్ చెంచు పెంటల వరకు వాహనాల్లో వెళ్లి అక్కడి నుంచి కాలినడకన లింగమయ్యను చేరుకుంటున్నారు.
మరో రూట్లో లింగాల మీదుగా అప్పాయిపల్లి మార్గం గుండా గిరిజగుండాల వరకు వాహనాలలో వచ్చి అక్కడి నుంచి 7కిలోమీట ర్లు కాలినడకన ప్రయాణించి క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. కాగా గతంలో లేని విధంగా రెండేండ్లుగా అట వీ శాఖ అధికారులు ఆంక్షలు విధించి వాహనాలకు ఎంట్రీ ఫీజు వసూలు చేయడాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్షేత్రానికి వెళ్తున్న భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్లు సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 22 : జాతరకు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునా థ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 300 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించామన్నారు. వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా జేసీబీ, ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామన్నారు.